వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌతమ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. రూ. 50 వేల పెట్టుబడితో తన దానిమ్మ తోటలో ఏఐ సెన్సార్లను ఏర్పాటు చేసి, నేల తేమ, వాతావరణ పరిస్థితులు, పోషకాలను కచ్చితత్వంతో గమనిస్తూ పంటను సమర్థవంతంగా సాగు చేస్తున్నారు.
ఈ వ్యవస్థ భూమిలోని తేమను బట్టి నీటిని అందించడం, ఆపడం వంటి సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. తద్వారా వనరులను ఆదా చేస్తూ అధిక దిగుబడిని సాధించేందుకు రైతులకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.
Comments
Loading comments...

