వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతుబజార్లను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక ఆదేశాలు ఇచ్చారు. జులైలో మదనపల్లెలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
మత్స్యకారుల కోసం రూ. 240 కోట్లతో 200 మరపడవలను అందించనున్నారు. అలాగే, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద కోకోసిటీ ఏర్పాటును పరిశీలించాలని, పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కు రూ. 3 కోట్లు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

