Back to feed
మహిళలకు 33% సీట్లు: లోకేశ్
Rohit Singh May 27, 2026 7:41 AM అమరావతి 9 viewsabout 12 hours ago

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రకటించారు. పార్లమెంట్లో బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ తరఫున ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై వైకాపాతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆ పార్టీ హయాంలో బీసీ, దళిత వర్గాలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. తమది అభివృద్ధి చేసే 'గూగుల్' మైండ్ అయితే, వైకాపాది 'గొడ్డలి' సంస్కృతి అని లోకేశ్ మండిపడ్డారు.
Comments
Loading comments...



