Back to feed
24 గంటల తాగునీరు: కేటీఆర్
Rohit Singh May 26, 2026 5:48 AM హైదరాబాద్ 17 views1 day ago

రాబోయే రోజుల్లో భారాస మళ్లీ అధికారంలోకి రాగానే, హైదరాబాద్ నుంచే 24 గంటల నిరంతర తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. కూకట్పల్లి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 'హైడ్రా' పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ వారిని నిరాశ్రయులను చేస్తోందని మండిపడ్డారు.
రానున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన వారి పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...



