Back to feed
బాలికపై లైంగిక దాడి: నిందితుడికి 20 ఏళ్ల జైలు
Rohit Choudhary May 27, 2026 6:33 AM హైదరాబాద్ 9 viewsabout 13 hours ago

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సందీప్ కుమార్ అలియాస్ శ్యామ్కు రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ జరిపిన న్యాయమూర్తి టి. శ్రీనివాస్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
స్థానిక ప్రాంతానికి చెందిన నిందితుడు, బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం నిరూపితం కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
Comments
Loading comments...



