Back to feed
రూ.15 కోట్లతో ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి
Harika Jun 16, 2026 12:28 PM పెద్దపల్లి 5 viewsabout 2 hours ago

పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని రూ. 15 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ కోసం మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు.
దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ప్రణాళికపై చర్చించారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో మెరుగైన వసతులు కల్పించి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...



