Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు చుక్కెదురు: నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.

Udayam Digital Staff Apr 03, 2026 9:43 AM హైదరాబాద్ 5 viewsabout 1 month ago
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు చుక్కెదురు: నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. - Udayam Digital
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఉద్యోగ నియామక ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ, నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం కొట్టివేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మూల్యాంకనం మూడుసార్లు నిష్పక్షపాతంగా జరిగిందని, అక్రమాలకు తావులేదని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అభ్యర్థుల వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 నియామక ప్రక్రియ కొనసాగించడానికి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...