Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రభుత్వ పాఠశాలల్లో పాల పంపిణీ.

Udayam Digital Staff Apr 09, 2026 5:15 AM హైదరాబాద్ 9 viewsabout 1 month ago
ప్రభుత్వ పాఠశాలల్లో పాల పంపిణీ. - Udayam Digital
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విజయ డెయిరీకి రూ.120 కోట్ల విలువైన ఆర్డర్‌ను విద్యాశాఖ ఇప్పటికే జారీ చేసింది. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైన నాటి నుండి 150-200 మి.లీ. టెట్రా ప్యాక్‌లలో పాలు సరఫరా చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ, విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...