Back to feed
అమరావతిపై వైసీపీ కుట్రలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆగ్రహం
Suresh Jun 15, 2026 9:45 AM అమరావతి 4 viewsabout 2 hours ago

అమరావతిపై కుల విషం చిమ్ముతూ వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాజధాని భూముల్లో అన్ని కులాల వాటా ఉందని, వైసీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పారదర్శకంగా జరిగిన నియామకాలపై అబద్ధాలు మానుకోవాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు.
Comments
Loading comments...


