Back to feed
సికింద్రాబాద్లో యోగా సందడి
Aditi Jun 20, 2026 5:55 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ యోగా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.
నిత్యం యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఈ సందర్భంగా కిషన్రెడ్డి తెలిపారు. యోగా ద్వారా రుగ్మతలకు దూరంగా ఉంటూ, శారీరక మరియు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...



