Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీవారి దర్శనానికి 12 గంటల నిరీక్షణ

Ravi Shukla Jun 03, 2026 4:25 AM తిరుపతి 14 viewsabout 20 hours ago
శ్రీవారి దర్శనానికి 12 గంటల నిరీక్షణ - Udayam Digital
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా దర్శనానికి సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, సోమవారం సుమారు 83,382 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 34,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో సరైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...