వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తాలిపేరు వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన రాముల సూర్యరావు (38), ఆయన కుమారుడు దేవ్ హర్ష ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు.
మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో మొగళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

