Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తాలిపేరు వాగులో విషాదం: తండ్రీకొడుకుల మృతి

Siddharth Varadarajan Jun 02, 2026 8:46 AM భద్రాద్రి కొత్తగూడెం 22 views1 day ago
తాలిపేరు వాగులో విషాదం: తండ్రీకొడుకుల మృతి - Udayam Digital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తాలిపేరు వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన రాముల సూర్యరావు (38), ఆయన కుమారుడు దేవ్ హర్ష ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో మొగళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...