వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైలో విషాదం: స్కూలు బస్సుపై పడిన చెట్టు

మంగళవారం ముంబైలోని చెంబూర్లో పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలిపోవడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 13 మంది విద్యార్థులు ఉన్నారు.
స్థానికులు, బస్సు కండక్టర్ సకాలంలో స్పందించి చిన్నారులను రక్షించారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది వచ్చేలోపే సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...