Back to feed
పోలవరంలో పెద్దపులి కలకలం
Vikram Chandra Jun 03, 2026 6:59 AM ఎలూరు 13 viewsabout 17 hours ago

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి పులి దాడిలో 16 దూడలు, ఒక గేదె మృతి చెందాయి. దీంతో స్థానిక పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...


