వార్తలకు తిరిగి వెళ్లండి

కొసారాలో రాజేందర్, సుశీల అనే దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నిద్రలో ఉన్న వీరిని గొంతు నులిమి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని పాత కక్షలే ఈ ఘాతుకానికి కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

