Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ పర్యవేక్షణ

Harika Jun 18, 2026 7:06 AM మహబూబ్‌నగర్ 8 viewsabout 1 hour ago
సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ పర్యవేక్షణ - Udayam Digital
కల్వకుర్తి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వెల్దండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...