Back to feed
ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'.. తెలుగులో 'వీరభద్రుడు'గా గ్రాండ్ ఎంట్రీ
Priya Singh Jun 08, 2026 10:48 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో వచ్చి థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కరుప్పు'. ఈ బ్లాక్బస్టర్ చిత్రం జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ కూడా అదే రోజున అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక సపరేట్ స్టాండ్అలోన్ లింక్ను కేటాయించడం విశేషం. థియేటర్ ఎక్స్పీరియన్స్ను డిజిటల్లోనూ అందించేందుకు ఈ సరికొత్త ప్లాన్ చేశారు.
Comments
Loading comments...



