Back to feed
శ్రీకాకుళంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యల కలకలం
Rakesh Jun 19, 2026 7:12 AM శ్రీకాకుళం 2 viewsabout 2 hours ago

శ్రీకాకుళం జిల్లాలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, మానసిక ఒత్తిడి కారణంగా కొందరు క్షణికావేశంలో రైల్వే పట్టాలను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. టెక్కలి, నరసన్నపేట, పొందూరు, పలాస ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి.
ఈ సంఘటనలు సమాజంలో పెరుగుతున్న తీవ్ర మానసిక సమస్యలకు, ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలాంటి దురదృష్టకర నిర్ణయాలను నివారించేందుకు కౌన్సెలింగ్ మరియు సామాజిక అవగాహన అవసరమని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...



