Back to feed




యాదగిరీశుడికి నైవేద్యం కష్టాలు: ఏడాదిగా పనిచేయని లిఫ్టు
Sonia Singh May 11, 2026 9:57 AM నల్గొండ 0 viewsabout 2 hours ago

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నైవేద్యాల తరలింపులో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ హెడ్రాలిక్ లిఫ్టు ఏడాదిగా మరమ్మతుకు గురికావడంతో, అర్చకులు భోగాలను మెట్ల మార్గం ద్వారా మోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.
భక్తులు నడిచే దారిలోనే ప్రసాదాలను తీసుకెళ్లడం అపచారమని అర్చకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో బరువులు మోస్తూ మెట్లు దిగడం సిబ్బందికి భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి లిఫ్టుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
పాతబస్తీ మెట్రోపై నీలినీడలు: భూసేకరణ, అనుమతుల్లో జాప్యం
32 minutes ago
తెలంగాణ
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డారు
about 1 hour ago
తెలంగాణ
తొర్రూరులో మక్క రైతుల రాస్తారోకో: కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం
about 1 hour ago
తెలంగాణ