Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం

Suman Gupta Jun 01, 2026 11:10 AM విశాఖపట్నం 6 viewsabout 1 hour ago
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం - Udayam Digital
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజల చారిత్రాత్మక విజయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు నిజమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇది రైల్వే పరిపాలనను బలోపేతం చేయడమే కాకుండా, కనెక్టివిటీని మెరుగుపరిచి ఆర్థిక వృద్ధిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...