వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఆర్టీసీ బస్సుల కొరత ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. జగిత్యాల నుండి కేవలం ఒక్కటే బస్సు నడుస్తుండటంతో, ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అదనపు బస్సులను నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

