వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పర్లపల్లికి చెందిన ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

