Back to feed
సర్వీస్ టీచర్లకు ఊరట: ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక టెట్
Priya Singh Jun 04, 2026 9:05 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ అర్హత లేని సుమారు 30 వేల మంది సర్వీస్ టీచర్లకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
నిరుద్యోగులతో సంబంధం లేకుండా కేవలం ఉపాధ్యాయుల కోసమే ఈ పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. సిలబస్ కూడా సులభంగా ఉండేలా ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Loading comments...



