వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక గంజాయి ముఠా గుట్టును రట్టు చేసింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందాడు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారవ్వడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు.
లారీలో తవుడు బస్తాల కింద దాచిన 500 కేజీలకు పైగా గంజాయిని పోలీసులు గుర్తించారు. ఇది మన్యం నుండి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

