Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రోడ్డు ప్రమాదం: లారీలో 500 కేజీల గంజాయి గుర్తింపు.

Ravi Shukla Jun 03, 2026 6:52 AM ప్రకాశం 14 viewsabout 17 hours ago
రోడ్డు ప్రమాదం: లారీలో 500 కేజీల గంజాయి గుర్తింపు. - Udayam Digital
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక గంజాయి ముఠా గుట్టును రట్టు చేసింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందాడు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారవ్వడంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. లారీలో తవుడు బస్తాల కింద దాచిన 500 కేజీలకు పైగా గంజాయిని పోలీసులు గుర్తించారు. ఇది మన్యం నుండి తమిళనాడుకు తరలిస్తున్నట్లు తేలింది. పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...