వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ బీఆర్ఎస్ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో కష్టపడే వారికే సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఓటరు నమోదు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను బూత్ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా నిర్వహించాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, గులాబీ జెండానే మళ్ళీ ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

