వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్-యూజీ పరీక్ష రద్దు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల శ్రమ వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. కేంద్రం పెంచుతున్న ధరలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

