వార్తలకు తిరిగి వెళ్లండి
దిగ్గజాల సరసన చేరిన రాజమౌళి ఖ్యాతి

ఫ్రాన్స్లోని ప్రసిద్ధ ఇన్స్టిట్యూట్ లూమియర్ వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్లో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరుతో శాశ్వత ఫలకం ఆవిష్కృతమైంది. ఈగ, ఆర్ఆర్ఆర్ చిత్రాల ప్రదర్శన అనంతరం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ చేతుల మీదుగా ఈ గౌరవం దక్కింది.
మార్టిన్ స్కోర్సెసే, క్వెంటిన్ టరాంటినో వంటి ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన తన పేరు చేరడంపై జక్కన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ అపురూప ఘట్టం తన జీవితాంతం గుర్తుండిపోతుందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...