వార్తలకు తిరిగి వెళ్లండి

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ నాగం భూమయ్య నేతృత్వంలో పాలకవర్గం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చింది. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు హాల్లోనే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పాఠశాల మంజూరయ్యే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోకతోట లింబాద్రి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

