Back to feed
పవన్ కల్యాణ్పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
Amitabh Sinha Jun 01, 2026 10:33 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

తెలంగాణలో పవన్ కల్యాణ్ నిర్వహించనున్న సభపై టీఆర్ఎస్ నేత కవిత ఘాటుగా స్పందించారు. ముందు ఏపీలో రాజధాని అమరావతిని కట్టుకోవాలని, అక్కడ సచివాలయంలోకి నీళ్లు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఆంధ్రాలో పాలన చేతకాకే ఇక్కడ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందిస్తూ, తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ సభలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...



