వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఉదంతం తీవ్ర విచారకరమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సామాన్యులు, పేద మహిళలు దాచుకున్న సొమ్మును భక్తితో విరాళంగా ఇచ్చారని, అలాంటి నిధులు దొంగిలించబడటం అత్యంత సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు.
ఈ భారీ విరాళాల సేకరణకు పూనుకున్నవారే భద్రతకు బాధ్యత వహించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. ఈ దారుణంపై ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించి, అసలు ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

