వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే జనసేన సభ నిర్వహించి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి ప్రజలు ఊరుకోరని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ పవన్ను వాడుకుంటోందని ఆరోపించారు. పవన్ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని పేర్కొన్న దయాకర్, ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

