Back to feed
నిజామాబాద్లో దొంగల బీభత్సం
Riya Singh May 28, 2026 5:37 AM నిజామాబాద్ 4 viewsabout 1 hour ago

నిజామాబాద్ పద్మానగర్లో విద్యుత్తు సరఫరా లేని సమయంలో ఒక దుండగుడు ఇళ్లల్లోకి చొరబడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. తలుపులు తెరిచి నిద్రపోతున్న వారిని లక్ష్యంగా చేసుకుని, రెండున్నర తులాల బంగారం, నగదు దోచుకున్నాడు.
చివరి ఇంట్లో వృద్ధ దంపతులను కత్తితో బెదిరించి నగదు లాక్కెళ్లాడు. స్థానికులు వెంబడించినా నిందితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...


