వార్తలకు తిరిగి వెళ్లండి
లండన్ కోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ
రాజేష్ కుమార్ Jun 24, 2026 9:43 AM అల్ ఇండియా 3 viewsabout 14 hours ago

భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన కేసులో, నీరవ్ మోదీ సుమారు రూ.100 కోట్ల (10.7 మిలియన్ డాలర్లు) వ్యక్తిగత గ్యారెంటీని చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు జడ్జి జస్టిస్ సైమన్ టింక్లర్ జూన్ 23న ఈ కీలక తీర్పునిచ్చారు. 4.1 మిలియన్ డాలర్ల అసలుతో పాటు దానిపై వడ్డీని కూడా వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
Comments
Loading comments...