వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. గత మే నెలలో ఏకంగా రూ.29.90 లక్షల కోట్ల విలువైన 23.2 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా గణాంకాల్లో వెల్లడించింది.
గతేడాది మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువలో 19 శాతం, సంఖ్యలో 24 శాతం వృద్ధి నమోదైంది. వేసవి సెలవుల ప్రయాణాలు, ఐపీఎల్ సీజన్ మరియు ఆన్లైన్ షాపింగ్ కారణంగానే డిజిటల్ చెల్లింపులు ఈ స్థాయిలో పెరిగినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...

