Back to feed
నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం
Harika Jun 18, 2026 6:54 AM జనగామ 5 viewsabout 1 hour ago

జనగామ జిల్లా నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో సాయం చేస్తున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంతో ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



