Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమిషం ఆలస్యం చెదిరిన నీట్ కలలు

Rani Jun 22, 2026 8:26 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
మధ్యప్రదేశ్‌లోని విదిశ గర్ల్స్ కాలేజ్ రీ-నీట్ (#NEET) పరీక్షా కేంద్రం వద్ద అత్యంత హృదయవిదారక ఘటనా చోటుచేసుకుంది. స్వల్ప సమయం ఆలస్యం కావడం, బయోమెట్రిక్ సమస్యలు మరియు అడ్మిట్ కార్డ్‌లో జరిగిన తప్పుల కారణంగా ముగ్గురు విద్యార్థినులు ఈ కీలక పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. కళ్లముందే తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో పరీక్షా కేంద్రం వెలుపల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఏళ్ల తరబడి పడ్డ కష్టం, త్యాగాలు, కన్న కలలు ఒక్క క్షణంలో చెదిరిపోవడంతో అక్కడ ఉన్నవారందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Comments

G
Loading comments...