వార్తలకు తిరిగి వెళ్లండి
నరేష్ చంద్ర దేవ్ వర్మకు ‘పద్మశ్రీ’ పురస్కారం
అమరేష్ గౌడ్ Jun 24, 2026 8:43 AM అల్ ఇండియా 4 viewsabout 15 hours ago

సాహిత్యం, విద్యా రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గానూ త్రిపురకు చెందిన ప్రముఖ రచయిత నరేష్ చంద్ర దేవ్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
త్రిపురలోని దాదాపు 15 లక్షల మంది గిరిజన ప్రజల మాతృభాష అయిన 'కోక్బోరోక్' వ్యాకరణం, సంస్కృతిపై ఆయన లోతైన పరిశోధనలు చేశారు. ఈ భాషా పరిరక్షణకు, సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యం.
Comments
Loading comments...