Back to feed
తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి మృతి
H Jun 18, 2026 5:12 AM నాగర్ కర్నూల్ 1 viewsabout 2 hours ago

నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వయోభారంతో తల్లి నర్సమ్మ మరణించిన వారం రోజులకే, ఆ వేదనను తట్టుకోలేక కుమారుడు వెంకట్రాములు గుండెపోటుతో మృతి చెందారు.
తల్లి దశదినకర్మ జరగాల్సిన రోజే ఆయన మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెంకట్రాములుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Comments
Loading comments...



