వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద యూరియా పంపిణీ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
యాప్ విధానం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని, ఇది రైతులను ఇబ్బంది పెట్టడమేనని ఆయన విమర్శించారు. తక్షణమే ఈ యాప్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

