Back to feed
మంత్రి లక్ష్మణ్కు కొప్పుల సవాల్
Richa Jun 18, 2026 6:03 AM హైదరాబాద్ 11 viewsabout 4 hours ago

అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పలేక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఇసుక రీచ్ల మాయంపై నిజాయితీ ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు.
కులం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే లక్ష్మణ్ తనపై అనవసర దూషణలకు దిగుతున్నారని ఈశ్వర్ ఆరోపించారు.
Comments
Loading comments...



