వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ప్రకాశం జిల్లా భీమవరం వద్ద మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి ప్రయాణికులను కిందకు దించేశాడు.
డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

