Back to feed
కేరళలో భారీగా మత్తుపదార్థాల స్వాధీనం
Vikram Chandra May 30, 2026 10:48 AM అల్ ఇండియా 11 viewsabout 8 hours ago

కేరళలో డీఆర్ఐ చేపట్టిన 'ఆపరేషన్ చక్రవ్యూహ'లో 24 కేజీల కంటే ఎక్కువ మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి, మలప్పురం, తిరువనంతపురంలో సాగిన ఈ దాడుల్లో ఐదుగురు స్మగ్లర్లను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో మెథాక్వాలోన్, మెథాంఫెటామైన్, హషీష్ ఆయిల్ ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ కేరళలో రూ.70 కోట్ల విలువైన డ్రగ్స్ను పట్టుకుంది.
Comments
Loading comments...


