Back to feed
భూముల విలువ పెంపు: రేపటి నుంచే కొత్త ధరలు అమలు
Arvind Singh Jun 04, 2026 1:24 PM హైదరాబాద్ 6 viewsabout 2 hours ago

తెలంగాణలో మార్కెట్ విలువ ప్రకారం భూముల ధరలు శుక్రవారం నుంచి పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏరియాలను బట్టి ఇవి 50 నుంచి 100 శాతం వరకు పెరుగుతాయని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.1200 కోట్ల పైగా అదనపు ఆదాయం రానుందని పేర్కొన్నారు.
అయితే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రైమ్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ పెంపుదలపై సచివాలయంలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు.
Comments
Loading comments...


