Back to feed
సికింద్రాబాద్లో ప్రమాదం: విద్యార్థి మృతి
Vikram Chandra Jun 04, 2026 12:27 PM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago

సికింద్రాబాద్ జలమండలి కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో గురునానక్ కళాశాల విద్యార్థి విశాల్ మదన్ అక్కడికక్కడే మృతిచెందాడు. జూబ్లీ బస్స్టేషన్ నుండి ఉప్పల్కు బైక్పై వెళ్తుండగా ఈ దురదృష్టకర ప్రమాదం జరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


