వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాగు భూమిని 2.29 కోట్ల ఎకరాలకు పెంచి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తాము సాధించిన ప్రగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఒకవేళ తన లెక్కలు తప్పని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, తెలంగాణ వ్యతిరేకులు అధికారంలో ఉండటం బాధాకరమని విమర్శించారు.
Comments
Loading comments...

