Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్తీక్.

Neha Singh Jun 03, 2026 6:11 AM సిద్దిపేట 11 viewsabout 18 hours ago
సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కార్తీక్. - Udayam Digital
హుస్నాబాద్‌లో సరదాగా ఈతకు వెళ్లిన కార్తీక్ (25) అనే యువకుడు చెరువులో మునిగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా పచ్చునూరుకు చెందిన ఇతను, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భోజన విరామ సమయంలో స్నేహితులతో కలిసి ఎల్లమ్మ చెరువులోకి దిగి, నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కార్తీక్ కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...