Back to feed
ముగిసిన జేఈఈ అడ్వాన్స్డ్!
Priya Singh May 18, 2026 6:16 AM హైదరాబాద్ 2 views10 days ago

ఐఐటీల్లో సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సజావుగా ముగిసింది. అయితే రెండు పేపర్లలోనూ ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా, లెక్కలు సాధించడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
గణితం ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మధ్యస్థంగా వచ్చాయని, కెమిస్ట్రీ విభాగం మాత్రం కాస్త సులభంగానే ఉన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 1న విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...


