ఎడ్యుకేషన్రేపటి నుంచి టీజీ ఐసెట్: పరీక్షలకు సర్వం సిద్ధం
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్షలు ఈనెల 13, 14 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 69 కేంద్రాల్లో 56,223 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మూడు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని, అభ్యర్థులు గంట ముందే చేరుకోవాలని కన్వీనర్ సూచించారు. హాల్టికెట్లపై రూట్మ్యాప్, బార్కోడ్ సౌకర్యం కల్పించారు.