Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. ఒక భారతీయుడు గల్లంతు

శిరీష గౌడ్ Jul 12, 2026 8:21 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. ఒక భారతీయుడు గల్లంతు - Udayam Digital
ఒమన్ తీరంలోని హర్మూజ్ జలసంధి వద్ద 'జీఎఫ్‌ఎస్ గెలాక్సీ' అనే వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా, పది మందిని సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దాడితో నౌకలో భారీగా మంటలు చెలరేగగా, గల్లంతైన వ్యక్తి కోసం ఒమన్ ప్రభుత్వ సహకారంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్.. పరిస్థితిని సమీక్షిస్తోంది. కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లోని 140 లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Comments

G
Loading comments...