Back to feed
ఐపీఎల్ 2027 షెడ్యూల్లో మార్పులు
Ravish Jun 18, 2026 9:08 AM అల్ ఇండియా 5 views2 days ago

ఎండల తీవ్రత దృష్ట్యా ఐపీఎల్ 2027 సీజన్ను మార్చి 10 నుండి మే 15 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అభిమానుల సౌకర్యం కోసం టోర్నీని రెండు వారాల ముందుగానే ప్రారంభించనున్నట్లు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
అంతర్జాతీయ క్యాలెండర్ను బట్టి మ్యాచ్ల సంఖ్యను 74గానే కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్లను పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...



